ఏపీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు రూట్ మార్చారు. వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ.. ప్రజలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు ప్రజలకు రాజధాని కావాలి కానీ.. రాజధాని నిలుపుకునేందుకు ఏమీ చేయరని.. 460 రోజులకు పైగా రైతులు ఆందోళన చేస్తుంటే మీరేం చేశారని పేర్కొన్నారు. గుంటూరు మిర్చి రోషం మీలో లేదా.. ఎందుకు భయపడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. గుంటూరు వాసులకు స్వార్దం , పిరికితనం ఎక్కువ, రోషం లేదని…ఒక ఉన్మాది చేతుల్లో అమరావతి బలైందని మండిపడ్డారు. కేసులు పెట్టి భయపెడతారు, ఓ రోజు జైలుకు వెళ్తే ఏమౌతుందన్నారు. తన మీద కూడా కేసులు పెట్టారు.. ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నాను.. తాను భయపడే సమస్య లేదని స్పష్టం చేశారు. వడ్డితో సహా తిరిగి చెల్లించే రోజులు వస్తాయని.. గుంటూరు కార్పొరేషన్లో వైసీపీ గెలిస్తే అమరావతిని వారికి రాసిచ్చినట్టేనన్నారు. మీకు రోషం లేదు రూ. 2 వేలు ఎవరూ ఇస్తే వాడికి ఓటేస్తారని ప్రజలపై మండిపడ్డారు. భవన నిర్మాణ కార్మికులు పనులు లేక పడినా.. రూ. 2 వేలిస్తే మర్చిపోతారని ఆవేశం వ్యక్తం చేశారు. బాబాయ్ కేసు ఏం చేశాడు, పింక్ డైమండ్ కేసు ఏమైంది, చెల్లెలికి న్యాయం చేయలేదని ఫైర్ అయ్యారు.
previous post
దోపిడీదారులు నిప్పు కణికల్లా బిల్డప్ ఇస్తుంటారు: విజయసాయిరెడ్డి