telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్ 2020 :గెలిచిన హైదరాబాద్… ఢిల్లీకి వరుసగా మూడో ఓటమి

దుబాయ్ వేదికగా ఈ రోజు ఐపీఎల్ 2020 లో ఢిల్లీ క్యాపిటల్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకోవడంతో హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే ఈ మ్యాచ్ లో ఓపెనర్లుగా వచ్చిన డేవిడ్ వార్నర్(68), వృద్దిమాన్ సాహా(87) మనీష్ పాండే(41) గా రెచ్చిపోవడంతో హైదరాబాద్ నిర్ణిత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఇక 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన ఢిల్లీ మొదటి నుండే తడబడింది. హైదరాబాద్ బౌలర్లు మొదటి నుండే అటాక్ ప్రారంభించారు. అయితే 54 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ 131 ఓవర్లకి ఆల్ ఔట్ అయ్యింది. సన్ రైజర్స్ బౌలర్లు రషీద్ ఖాన్ 3 వికెట్లు, సందీప్ శర్మ, టి నటరాజన్ రెండు వికెట్లు తీసుకోగా విజయ్ శంకర్, జాసన్ హోల్డర్, షాబాజ్ నదీమ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. దాంతో 19 ఓవర్లలోనే ఢిల్లీ ఆల్ ఔట్ కావడంతో హైదరాబాద్ 88 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఢిల్లీకి ఇది వరుసగా మూడో ఓటమి. ఈ విజయంతో సన్ రైజర్స్ తమ ప్లే ఆఫ్ లో ఉండే చివరి అవకాశాలను నిలుపుకుంది.

Related posts