telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

రోడ్డుపై పేలిన కారు బాంబు.. నలుగురు దుర్మరణం 

 అప్ఘనిస్తాన్ రాజదాని కాబూల్ సమీపంలో  కారు బాంబు పేలుడు ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.  కాబూల్ జిల్లాలోని పుల్-ఎ-చఖ్రీ రోడ్డుపై ఈ పేలుడు సంభవించింది. భద్రతాదళాల కాన్వాయ్ ను లక్ష్యంగా చేసుకుని జరిపిన పేలుడులో నలుగురు మృతి చెందగా మరికొందరు గాయపడారు.

యూఎస్ సర్వీస్ మెన్ తోపాటు మరికొంతమంది గాయపడ్డారని అప్ఘనిస్తాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నశ్రత్ రహిమి తెలిపారు. ఉదయం 8:30 గంటలకు ఖాలా-ఇ-వజీర్ ప్రాంతంలో కారు బాంబు పేలుడు జరిగిందన్నారు. అయితే ఈ దాడులు ఎవరు చేశారనేది తెలియాల్సి ఉంది. 

Related posts