telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

దొంగ ఓట్ల పేరుతో టీడీపీ డ్రామాలు…

Peddireddy

ఏపీలో ఈరోజు తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్‌ జరుగుతుంది. అయితే ఈ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు బయట నుంచి వేల మందిని తిరుపతికి తరలించారని లక్ష్మీపురం, కెనడీనగర్‌ కూడలి వద్ద తెదేపా నేతలు నిరసనకు దిగారు.  ప్రైవేటు బస్సులను ఆపి టీడీపీ నేతలు దాని బైఠాయించారు. అటు ఏపీ ఎన్నికల సంఘం కు చంద్రబాబు లేఖ రాశారు. రిగ్గింగ్, హింస ను ప్రేరేపించేందుకు పెద్ద ఎత్తున బయట వ్యక్తులు చొరబడ్డారన్న చంద్రబాబు.. అదనపు బలగాలను దించాలని కోరారు చంద్రబాబు. అయితే దీనిపై మంత్రి పెద్దిరెడ్డి.. టీడీపీ కి కౌంటర్ ఇచ్చారు.  పోలింగ్ పై టీడీపీ అబద్దాలు ప్రచారం చేస్తోందని.. బస్సుల్లో వెళ్లే ప్రయాణికులను టీడీపీ నాయకులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. దొంగ ఓట్ల పేరుతో టీడీపీ డ్రామాలు ఆడుతుందని ఫైర్ అయ్యారు. ఓటమికి ముందే దొంగ ఓట్ల పేరుతో టీడీపీ సాకులు వెతుక్కుంటుందని ఎద్దేవా చేశారు.

Related posts