telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటుకు నిబంధనలు: మంత్రి బొత్స

botsa ycp

సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటుకు నిబంధనలు ఉంటాయని ఏపీ మెంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ..శాసన మండలి ఛైర్మన్‌కు విచక్షణాధికారం ఉంటే ప్రభుత్వానికి కూడా ఉంటుందని పేర్కొన్నారు.అసెంబ్లీ సెక్రటరీపై ఒత్తిడి తేవాల్సిన అవసరం మంత్రులకు లేదని స్పష్టం చేశారు.

నిబంధనల ప్రకారమే అసెంబ్లీ సెక్రటరీ వ్యవహరిస్తారని తెలిపారు. రూల్‌ ప్రకారం వెళ్లాలని అధికార పక్షం కోరితే, ప్రతిపక్షం మాత్రం రూల్‌కు విరుద్ధంగా వెళ్లాలని చెప్పడం మండలి చరిత్రలో చోటుచేసుకున్న ఆశ్చర్యకర పరిణామమని బొత్స అన్నారు. రాజధాని వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని కేంద్రం ఎప్పుడో చెప్పిందని బొత్స గుర్తు చేశారు.

Related posts