టీడీపీ నేత చంద్రబాబు యూరప్ పర్యటన ముగిసేలోపే ఏపీ రాజకీయ ముఖచిత్రం మారిపోతుందని బీజేపీ నేత విష్ణువర్థన్రెడ్డి అన్నారు. చాలా మంది టీడీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. టీడీపీ నేతలంతా కాషాయ కండువా కప్పుకునేందుకు క్యూ కడుతున్నారన్నారు. బాబు వారసత్వం, బానిసత్వాల నుంచి విముక్తి కావాలని నేతలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
టీడీపీ నుంచే కాకుండా కాంగ్రెస్, జనసేన పార్టీల నుంచి కూడా బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నారని వెల్లడించారు.ఇదిలా ఉంటే ఇప్పటికే నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి రామ్మోహన్రావు తమను బీజేపీ అనుబంధ సభ్యులుగా పరిగణించాలని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యకు లేఖ అందజేసీన సంగతి తెలిసిందే.