telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీ ఎంపీల వ్యవహారంపై ఘాటుగా స్పందించిన చంద్రబాబు!

chandrababu fire on AP CS again

టీడీపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్ రావు తదితరులు టీడీపీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారంటూ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఓవైపు టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ యాత్రలో ఉన్న తరుణంలో ఇలాంటి కథనాలు తెరపైకి రావడం గమనార్హం.

ఈ కథనాలపై ప్రస్తుతం విదేశాల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. బీజేపీ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఈరోజు పార్టీ సీనియర్, ముఖ్య నేతలతో ఆయన యూరప్ నుంచి ఫోన్ లో మాట్లాడారు. టీడీపీలో సంక్షోభాలు కొత్తవి కాదని చంద్రబాబు తెలిపారు. కార్యకర్తలు, నేతలు ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు. ఏపీ ప్రయోజనాల కోసమే బీజేపీతో పోరాడామని బాబు పేర్కొన్నారు.

Related posts