తెలంగాణలో రోజురోజుకూ ఢీలా పడుతున్న పార్టీని తిరిగి బలోపేతం చేయడంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. ఈ మేరకు శనివారం నిర్వహించిన టీటీడీపీ సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ఆదివారం ఆయన ముఖ్యనేతలతో చర్చించారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడానికి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. వారం లోగా కొత్త కమిటీలను భర్తీ చేయాలని ఆదేశించారు.
ఈ నెల 14 నుంచి ప్రతీ శనివారం హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో పార్టీ నాయకులతో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించనున్నట్టు ఈ సందర్భంగా నాయకులకు చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది. పార్టీని విడిచిపెట్టి వెళ్లిన వారిని మర్చిపోకుండా ఉన్న వారి గురించి ఆలోచించాలని చంద్రబాబు నేతలకు సూచించినట్టు సమాచారం.
డబ్ల్యూటీసీ కామెంటేటర్గా ప్రశంసలు అందుకుంటున్న కార్తీక్