ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంటుందని బీజేపీ హామీ ఇస్తుందని… మా అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా క్లారిటీ ఇచ్చారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు అన్నారు. అమరావతి రైతుల త్యాగాలు చిన్న చూపుతో చూడవద్దని…సీఎం జగన్ రైతులతో చర్చలు కొనసాగించాలని సూచించారు. అమరావతి అభివృద్ధికి జగన్ కట్టుబడి ఉండాలని…జగన్ ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు అమరావతి, పోలవరం అని ప్రవచనాలు పలికారని.. జగన్ కూడా నవరత్నాలు, మూడు రాజధానుల పాట పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆంద్రప్రదేశ్ లో చర్చిలకు జగన్ నిధులు ఇస్తున్నారని…జగన్ తన బావ కోసం చర్చిలకు నిధులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కు ఎందుకు ఓటు వేశామని ప్రజలు మదనపడుతున్నారని.. చర్చిలకు నిధులు ఇవ్వటాన్ని జగన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు రమేష్ నాయుడు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ పార్టీలకు ప్రజలు బుద్ది చెప్పాలని కోరారు రమేష్ నాయుడు.
previous post