telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ’ తో ఎంట్రీ ఇస్తున్న ప్రముఖ హీరో కూతురు

సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా వాళ్ల కుటుంబంలోని వాళ్లే ఎక్కువగా వస్తారు. ఇప్పుడు హీరోయిన్లుగా కూడా వాళ్ల కూతుళ్లను దించుతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. డా. రాజశేఖర్, జీవిత దంపతుల చిన్న కూతురు శివాత్మిక ఇప్పటికే ‘దొరసాని’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసింది. ఇప్పుడు పెద్ద కుమార్తె శివానీ.. అదిత్ అరుణ్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. ‘118’ మూవీతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్న సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ’ అనే పేరు పెట్టారు. అంటే ‘హూ, వేర్, వై’ అని అర్థం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న దీనిని హై టెక్నికల్ వాల్యూస్ తో నిర్మిస్తున్నామని, ఈ డిఫరెంట్ థ్రిల్లర్ కు మిర్చి కిరణ్ పవర్ ఫుల్ డైలాగ్స్ రాశారని నిర్మాత చెబుతున్నారు. సిమన్ కె కింగ్ సంగీతం అందిస్తున్న ‘డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ’ మూవీకి దర్శకత్వం వహించడంతో పాటు కెవి గుహన్ కథను, సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.

Related posts