telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నట్లు మాట్లాడుతున్నారు: కన్నా

Kanna laxminarayana

ఏపీలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నట్లు మాట్లాడుతున్నారని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. అధికారంలో ఉన్నట్లు ఆపార్టీ నేతలౌ మాట్లాడటం లేదన్నారు. గడిచిన ప్రభుత్వం చేసిన అరాచక పాలనను, కేంద్రాన్ని బూచిగా చూపించి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇప్పటి ప్రభుత్వం కూడా కేంద్రం మీదే ఆధారపడిందన్నారు. అప్పటి ప్రభుత్వం, ఇప్పటి వైసీపీ ప్రభుత్వం రెండూ రెండేనని కన్నా పేర్కొన్నారు.

ఏ ప్రాంతీయ పార్టీ అయినా కూడా తేడా ఉండదన్నారు. ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ పాలన, కుల పాలన, అవినీతి రాజ్యమేలుతోందన్నారు. బీజేపీ సారధ్యంలోనే అవినీతి రహిత పాలన సాధ్యమని చెప్పారు. పీపీఏ విషయంలో కేంద్రం నుంచి లెటర్‌ వచ్చిందన్నారు. గడిచిన ఐదేళ్లలో అవినీతి జరిగిందని దానిని మోదీ దృష్టికి తీసుకెళ్లి ఉండొచ్చన్నారు. మోదీ అవినీతికి వ్యతిరేకమని.. రూల్స్‌కి వ్యతిరేకంగా నడిచే మనస్తత్వం కాదన్నారు.

Related posts