కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్షా అన్నారు. ఆ రెండూ దళిత వ్యతిరేక పార్టీలని విమర్శించారు. ఆదివారం ‘బూత్ కార్యకర్త సమ్మేళన్’ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఢిల్లీ ప్రజలను కేజ్రీవాల్ ఎంతోకాలం మభ్యపెట్టి, మోసగించలేరని, అక్కడ రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
పౌరసత్వ సవరణ బిల్లుతో పౌరసత్వం తొలగిస్తారని మైనారిటీలను కాంగ్రెస్ పార్టీ రెచ్చగొడుతోందని దుయ్యబట్టారు. పౌరసత్వ సవరణ సీఏఏకు వ్యతిరకేంగా రాహుల్, ప్రియాంక హింసను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. సీఏఏపై తమ పార్టీ ఇంటింటికి వెళ్లి ప్రచారం సాగిస్తుందని, ప్రజలకు వాస్తవాలు వివరిస్తుందని హామీ ఇచ్చారు. దేశంలోని ఏ ఒక్కరి పౌరసత్వం ఊడలాక్కునే నిబంధన ఏదీ సీఏఏలో లేదని షా స్పష్టం చేశారు.
బెంగాల్ను కశ్మీర్లా మారుస్తున్నారు: ఎంపీ అర్జున్ సింగ్