తెలుగులో భారీ విజయాన్ని సాధించిన “అర్జున్ రెడ్డి” చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో తొలుత ఈ చిత్రాన్ని బాల దర్శకత్వంలో రీమేక్ చేశారు. “వర్మ” అనే టైటిల్తో తెరకెక్కిన ఈ మూవీ ఔట్పుట్ అనుకున్నంత బాగా రాకపోవడంతో ఈ సినిమాని మధ్యలోనే ఆపేసి, సందీప్ రెడ్డి వంగ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసిన గిరీశాయ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్నారు. “ఆదిత్యవర్మ” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2019, జూన్లో ఈ విడుదల చేస్తాము అని నిర్మాణ సంస్థ తెలిపింది. కాని ఈ చిత్ర విడుదలపై ఇప్పటికి క్లారిటీ లేదు. ఈ చిత్రానికి రధన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక సినిమాటోగ్రాఫర్గా రవి కె చంద్రన్ పని చేస్తున్నారు. ధృవ్ విక్రమ్ సరసన అక్టోబర్ చిత్ర ఫేం బానిటా సందు హీరోయిన్ గా నటిస్తుంది. ఈ4 ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియా ఆనంద్ మరో హీరోయిన్గా నటిస్తుంది. ఇటీవల చిత్ర టీజర్ విడుదల కాగా , దీనికి మంచి రెస్పాన్సే వచ్చింది.
“ఆదిత్యవర్మ” చిత్ర షూటింగ్ సోమవారం సాయంత్రానికి పూర్తైనట్టు తెలుస్తుంది. ధృవ్ తండ్రి విక్రమ్ కూడా గుమ్మడికాయ కొట్టే కార్యక్రమానికి హాజరైనట్టు సమాచారం. చివరి షాట్ని ధృవ్, బనిత సంధుపై చిత్రీకరించారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలని వేగవంతం చేసి ఈ ఏడాదే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మేకర్స్ భావిస్తున్నారు. ఆ మధ్య చిత్ర కథ ధృవ్కి అస్సలు కాలేదని సినిమాని థియేటర్స్ లోకి రాకుండా ఆపేస్తారని ప్రచారం జరిగింది. ఇప్పటి వరకు సినిమాకి ఖర్చైన మొత్తాన్ని విక్రమ్ నిర్మాతలకి తిరిగి ఇచ్చి సినిమాని ల్యాబ్ కే పరిమితం చేయాలని అనుకుంటున్నట్టు కూడా వార్తలు వచ్చాయి.