telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనా ఎఫెక్ట్ : పూజాహెగ్డేకి ఎన్ని కష్టాలొచ్చాయి…!

puja-hegde

ఇటీవలే ‘అల వైకుంఠపురములో’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు పూజా హెగ్డే. ప్రస్తుతం ప్రభాస్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జార్జియాలో జరుగుతోంది. అక్కడ కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉండటంతో సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టేశారు. ప్రభాస్ కూడా ఇప్పటికే అక్కడికి వెళ్లిపోయారు. అయితే, అక్కడే ప్రభాస్ – పూజా హెగ్డే కాంబినేషన్ సీన్స్ చేయాల్సి ఉంది. దీని కోసం ఇండియా నుంచి పూజా హెగ్డే బయలుదేరి వెళ్లారు. అయితే, ఆమె టర్కీలోని ఇస్తాంబుల్ మీదుగా జార్జియా వెళ్లారు. ఇస్తాంబుల్ న్యూ ఎయిర్‌పోర్ట్‌లో తీసుకున్న ఫొటోను పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పూజా.. ముఖానికి మాస్క్, చేతులకు గ్లోవ్స్ వేసుకుని ఉన్నారు. దీనికి కారణం కరోనా వైరస్ భయం. ప్రస్తుతం యూరప్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. అందుకే, రక్షణ చర్యల్లో భాగంగా పూజా హెగ్డే ఈ జాగ్రత్తలు తీసుకున్నారు.

Related posts