telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హీరోయిన్లపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

Vijayashanthi

సీనియన్ నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా చేస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఆమె ముఖానికి మేకప్ వేసుకుంటున్నారు. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందని సినిమా యూనిట్ చెబుతోంది. సరిలేరు నీకెవ్వరు సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే తాజాగా విజయశాంతి హీరోయిన్ల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈతరం హీరోయిన్లలో ఎవరంటే ఇష్టం అనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం దుమారానికి దారి తీస్తోంది. ఈ రోజుల్లో హీరోయిన్లుల ఏడాదిలో కేవలం రెండు, మూడు సినిమాలకే పరిమతం అవుతున్నారని విజయశాంతి అభిప్రాయపడ్డారు. తాము హీరోయిన్లుగా ఉన్న సమయంలో ఏడాదికి 15 నుంచి 18 సినిమాల్లో నటించేవారిమన్నారు. ఇప్పుడున్న హీరోయిన్లు పెద్దగా కష్టపడడం లేదనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. కేవలం రెండు, మూడు సినిమాలు మాత్రమే చేసి అలసిపోకుండా జాగ్రత్తపడుతున్నారని దెప్పిపొడిచారు.ప్రస్తుతం విజయశాంతి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

Related posts