మెగా ఫ్యామిలీకి గొప్ప వీరాభిమాని నూర్ మొహమ్మద్. అటు చిరంజీవి దగ్గర నుండి ఇటు వరుణ్ తేజ్ వరకు అందరు హీరోలని ఎంతగానో అభిమానిస్తుంటారు. గ్రేటర్ హైదరాబాద్ మెగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా ఉన్న నూర్ భాయ్ ఈ రోజు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతితో మెగా ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారు. మెగా ఫ్యామిలీ హీరోలు ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు మరి కొద్ది సేపట్లో మొహమ్మద్ ఇంటికి వెళ్ళనున్నట్టు తెలుస్తుంది. నూర్ మొహమ్మద్ మెగా హీరోల పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అభిమానుల మధ్య చిన్నపాటి గొడవలు కూడా రాకుండా అందరిని ఏకతాటిపై నడిపించారు. గత కొద్ది రోజులుగా నూర్ భాయ్ అనారోగ్యంతో బాధపడుతుండగా, ఇటీవల రామ్ చరణ్ ఆసుపత్రికి వెళ్లి ఆయనని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి మెగా హీరోలందరూ సంతాపం తెలియజేస్తున్నారు.
నూర్ మృతిపై రామ్ చరణ్ తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. “అభిమానులు మా కుటుంబం. మా ప్రియమైన కుటుంబ సభ్యుడు నూర్ మొహమ్మద్ జీని నిజంగా కోల్పోయాం. అతని సహాయ గుణం, ఎదుటి వారితో మెలిగే తీరు ఈ నాటి యువ తరానికి ఒక ప్రమాణంగా నిలిచింది.ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను” అని రామ్ చరణ్ స్పష్టం చేశారు.
Very Shocking & sad to here the demise of Senior MEGA Fan #NoorBhai 😫
May his soul REST IN PEACE & God be with his family.. #RIPNoorBhai pic.twitter.com/uiLlMbGgpP— Mega Heroes For a Reason™ (@AlwaysMegaHero) December 8, 2019
కీర్తి సురేష్ తాజా లుక్ పై వర్మ కామెంట్స్