telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

తెలుగు రాష్ట్రాల్లో పట్టాలెక్కనున్న ప్రైవేటు రైళ్లు

train secunderabad

దక్షిణమధ్య రైల్వే పరిధిలో ఐదు ప్రైవేటు రైళ్లు నడిపేందుకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో త్వరలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో లో ప్రైవేటు రైళ్లు కూతపెట్టనున్నాయి. ప్రయాణికులకు ప్రపంచస్థాయి సేవలు అందించాలన్న ఉద్దేశంతో దేశంలో వంద ప్రైవేటు రైళ్లకు రైల్వే బోర్డు అనుమతి మంజూరు చేసింది.

ఇందులో భాగంగా దక్షిణ మధ్య పరిధిలో ఐదు రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా అందులో మూడు సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతి నుంచి పరుగులు తీయనున్నాయి. ఏపీ, తెలంగాణలోని ప్రధాన నగరాలను కలుపుతూ అధునాతన సౌకర్యాలతో రైళ్లు తిరిగేలా ప్రైవేటు ఆపరేటర్లను ప్రభుత్వం నియమించనుంది.

Related posts