విశాఖ ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో డాక్టర్ సుధాకర్కు చికిత్స అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తల్లి వేసిన హెబియస్ కార్పస్ హౌస్ మోషన్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో ఈ రోజు విచారణ జరిపింది. ఇరు వర్గాల వాదన విన్న హైకోర్టు సుధాకర్ను డిశ్చార్జ్ చేయడానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఆసుపత్రి సూరింటెండెంట్ ను సంప్రదించి ఆయన ఎప్పుడైనా డిశ్చార్జ్ కావచ్చని తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతోన్న సీబీఐ విచారణకు ఆయన సహకరించాలని చెప్పింది.
తనకు ఎటువంటి అనారోగ్యం లేదని, అయినప్పటికీ మానసిక వైద్య శాలలో ఉంచారని సుధాకర్ వాదిస్తోన్న విషయం తెలిసిందే. సుధాకర్ను అరెస్టు చేయలేదని, అలాంటప్పుడు తన కుమారుడిని ఏ ప్రాతిపదికన ఆసుపత్రిలో బంధించారని ప్రశ్నిస్తూ ఆయన తల్లి హైకోర్టులో వేసిన పిటిషన్లో ప్రశ్నించారు.