telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సీబీఐ విచారణ చేసే దమ్ము బీజేపీకి ఉందా: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

jeevan-reddy

తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల పై కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఒకరికొకరు కొట్టినట్లు, తిట్టినట్లు నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ అవినీతి ఐదేళ్ల తరువాత బీజేపీకి గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ మీద సీబీఐ విచారణ చేసే దమ్ము బీజేపీకి ఉందా? అని సవాల్ విసిరారు.

అవినీతిని నిరూపించేందుకు కాంగ్రెస్ సిద్ధం అని ప్రకటించారు. బీజేపీ, టీఆర్ఎస్‌వి ముసుగు రాజకీయాలని విమర్శించారు. బిల్లుల ఆమోదానికి టీఆర్ఎస్ సహరించడంలేదా? అని జీవన్ రెడ్డి బీజేపీ నేతలను ప్రశ్నించారు. బీజేపీకి ఇప్పటికైనా బుద్ధి వచ్చిందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనా, టీఆర్ఎస్సా అనేది ఆ పార్టీలే తేల్చుకోవాలని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

Related posts