telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జీవో 2430పై ఎడిటర్స్ గిల్డ్ స్పందించడం పట్ల చంద్రబాబు హర్షం

chandrababu

రాష్ట్రంలో మీడియాపై నియంత్రణ కోసం ఆంధ్రప్రదేశ్ విడుదల చేసిన జీవో 2430పై సర్వత్రా విమర్శలు వెల్లువిరుస్తునాయి. తాజాగా, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా కూడాఈ జీవో పై స్పందించింది. ఇలాంటి చట్టాలతో మీడియాను కట్టడి చేయాలనుకోవడం సరికాదని తెలిపింది. ఈ జీవోను వెనక్కితీసుకోవాలని కోరుతున్నామని ఏపీ సర్కారుకు విజ్ఞప్తి చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.

మీడియాపై పెత్తనం చేసేందుకు ఉద్దేశించిన అనేక చీకటి చట్టాలపై గట్టిపోరాటం చేసిన ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాపై తనకు అపార గౌరవం ఉందని తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో అనేక పర్యాయాలు విజయవంతమైన ఎడిటర్స్ గిల్డ్ ఇప్పుడు జగన్ సర్కారు ఇచ్చిన జీవో 2430పై గళం విప్పడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. ఎడిటర్స్ గిల్డ్ కు ఈ సందర్భంగా సంఘీభావం ప్రకటిస్తున్నామని ట్విట్టర్ వేదికగా చంద్రబాబు పేర్కొన్నారు.

Related posts