telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పఠాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కేసును విచారించిన హైకోర్టు

పఠాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కేసును విచారించింది హైకోర్టు. తనను చంపుతానని బెదిరించిన ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని హైకోర్టు లో రిట్ పిటీషన్..పిటిషన్ దాఖలు చేసాడు జర్నలిస్టు సంతోష్ నాయక్. పోలీసులు నామ మాత్రంగా కేసు నమోదు చేసిన ఎమ్మెల్యే పై ఏలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టుకు తెలిపారు పిటీషనర్ తరపు న్యాయవాది ఉమేష్ చందర్. ఎస్సి, ఎస్టీ కేసులో అరెస్ట్ చేయకుండా పోలీసులు తాత్పర్యం చేస్తున్నారన్న పిటీషనర్ తరపు న్యాయవాది..ప్రజాస్వామ్యం లో ఫోర్థ్ ఎస్టేట్ లో ఉన్న ఒక జర్నలిస్టు ను బెదిరించడం, దూషించడం పత్రిక స్వేచ్ఛ కు భంగం కలిగించడమేనని కోర్టుకు తెలిపారు పిటీషనర్ తరపు న్యాయవాది. స్థానిక ప్రజా ప్రతినిధి గా ఉండి ఈ విధంగా వ్యవహరించిన ఎమ్మెల్యే ను వెంటనే అరెస్ట్ చేసి విదంగా ఆదేశాలు ఇవ్వాలన్న పిటీషనర్ తరపు న్యాయవాది. ఈ కేసులో ఆర్టికల్ 226 కు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు లను ప్రస్తావించారు ఉమేష్ చంద్ర. కేసు పూర్వపరాలను సమర్పిస్తామన్న పిటీషనర్ తరపు న్యాయవాది. ఇరు వాదనలు విన్న కోర్ట్ తదుపరి విచారణను సోమవారం కు వాయిదా వేసింది.

Related posts