నటుడు అడివి శేష్ అమెరికాలో ఉద్యోగాన్ని సైతం వదిలేసి సినిమాల పట్ల గల ఇంట్రెస్ట్ తో టాలీవుడ్ లో అడుగుపెట్టాడు. ఆయన కథానాయకుడిగా తాజాగా వచ్చిన ‘ఎవరు’ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, గతంలో తనకి ఎదురైన ఒక చేదు అనుభవం గురించి ప్రస్తావించాడు.
దర్శకుడిగా తాను చేసిన ‘కిస్’ చిత్రం మిగిల్చిన చేదు అనుభవాలను గుర్తుచేసుకున్నారు అడవి శేష్ ఆ సినిమా పెద్ద ఫ్లాప్ అయింది. అప్పటివరకూ సంపాదించుకున్నదంతా ఆ సినిమాతో పోయింది. ఆ సినిమా పోస్టర్స్ అంటించడానికి ఖర్చు చేసిన మైదాపిండి డబ్బులు కూడా రాలేదు. దాంతో దర్శకత్వాన్ని పక్కన పెట్టేసి నటనపైనే పూర్తి దృష్టి పెట్టాను. ఫ్లాప్ దర్శకుడు అనిపించుకున్నా, నటుడిగాను .. రచయితగాను సక్సెస్ అయినందుకు మాత్రం చాలా సంతోషంగా అనిపించింది. ‘క్షణం’ .. ‘గూఢచారి’ సినిమాలకి కథలను అందించింది నేనే’ అంటూ అడివి శేష్ చెప్పుకొచ్చాడు.
“ఆపమ్మా కొంచెం… నీకు బోర్ కొట్టట్లా…” ఫోటోగ్రాఫర్పై మహేష్ పంచ్