మరోసారి నటి కస్తూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో నివాసముంటున్న వ్యాపారవేత్త చెన్నైకి చెందిన ఆరోగ్యసామి క్లిమెంట్ నిర్మించి, దర్శకత్వం వహించి హీరోగా నటించిన చిత్రం “ముడివిల్లా పున్నగై”. సోమవారం చెన్నై ప్రసాద్ ల్యాబ్లో జరిగిన ఈ చిత్ర ఆడియో మరియు ట్రైలర్ విడుదల కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు వేలు ప్రభాకర్ మాట్లాడుతూ, ఇది పురుష సమాజమని, ఒక వ్యక్తి ధైర్యంగా ఇద్దరు భార్యలను వివాహం చేసుకోవచ్చని, అలా తనకు తెలిసిన చాలా మంది ప్రముఖులు ఉన్నారని, చివరకు ముఖ్యమంత్రులు కూడా ఇద్దరు ఇద్దరు భార్యలతో వారానికి రెండ్రోజులు ఇక్కడా, అక్కడా గడుపుతున్నారన్నారు. ఇటీవల వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ చిత్రం చూశానని, అందులో 70 ఏళ్ల వయసులో ఎన్టీయార్ మరో వివాహం చేసుకున్న విషయాలను చాలా ధైర్యంగా వర్మ చూపించారని అన్నారు. అలాగే, మహిళలు ఇద్దరు మొగుళ్లను వివాహం చేసుకొని వారానికి రెండ్రోజులు ఇక్కడా, అక్కడా ఉంటే ఈ సమాజం వారిని ఎలా చూస్తుందో ఒకసారి ఆలోచించాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన వ్యాఖ్యలపై కస్తూరి స్పందిస్తూ, అంత స్వాతంత్య్రం తమకు అవసరం లేదని, మహిళలను మహిళలుగా గౌరవిస్తే చాలని పేర్కొంది. ఈ కార్య క్రమంలో నటులు లివింగ్స్టన్, తమిళ రసన్ తదితరులు పాల్గొన్నారు.
previous post
next post
రామ్గోపాల్ వర్మ సైకో డైరెక్టర్: యామిని