telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం

Road accident 8 dead and 30 injured

తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. విల్లుపురంలోని అన్నారై ఫ్లై ఓవర్ వద్ద గురువారం తెల్లవారుజామున ఘటన చోటుచేసుకుంది. మినీ వ్యాన్ – ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. 14 మంది కార్మికులు కంచీపురం జిల్లా నుంచి తిరువూరు జిల్లాకు విద్యుత్ టవర్ల నిర్మాణ పనులకు ట్రక్కులో తరలివెళ్తున్నారు. కోయంబత్తూరు నుంచి చెన్నైకు వెళ్తున్న మినీ వ్యాన్‌లో 26 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అయితే కల్లాకుర్చి వద్ద ఈ రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్ ఎం. మణికండన్, వ్యాన్ డ్రైవర్ ఏ. రాజేంద్రన్‌తో సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చాలామంది మంది జార్ఖండ్‌కు చెందినవారు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Related posts