telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మిషన్ భగీరథతో అద్భుత ఫలితాలు: కేటీఆర్

ktr telangana

మిషన్ భగీరథతో అద్భుత ఫలితాలు వచ్చాయని తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో ఫ్లోరైడ్ ప్రభావిత, ప్రభావ రహిత రాష్ట్రాలతో కేంద్రం ఓ జాబితా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ స్పందిస్తూ తెలంగాణ ఏర్పాటు వేళ రాష్ట్రంలో 967 ఫ్లోరైడ్ గ్రామాలు ఉన్నాయని, ఇప్పుడు వాటి సంఖ్య సున్నా అని సగర్వంగా తెలిపారు. ఇదంతా మిషన్ భగీరథ కార్యాచరణ ఫలితమేనని అన్నారు.

రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి కృష్ణా, గోదావరి సుజలాలు అందిస్తున్నామని ఉద్ఘాటించారు. కేంద్రం ప్రకటనను తెలంగాణ పట్ల ఓ మెచ్చుకోలుగా భావిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ బృందానికి అభినందనలు తెలుపుకుంటున్నానని కేటీఆర్ ట్విట్టర్ లో వివరించారు. మిషన్ భగీరథ పథకంతో ఒనగూరిన ఫలితాలకు కేంద్రం విడుదల చేసిన నివేదికే స్పష్టమైన నిదర్శనం అని తెలిపారు. తెలంగాణలో ఒక్క ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామం కూడా లేదని కేంద్రం ప్రకటన ద్వారా స్పష్టమైందని తెలిపారు.

Related posts