ఉగ్రవాదం ప్రపంచానికి మంచిది కాదని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. విశ్వవ్యాప్తంగా ఉగ్రదాడుల నిరోధానికి కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఉగ్రదాడుల నిరోధకానికి సమగ్ర భద్రత కల్పించే విషయమై జరుగుతున్న చర్చలను యూఎన్ త్వరగా ముగించాలని వెంకయ్య విజ్ఞప్తి చేశారు.ప్రయగారాజ్ కుంభ్లోని మేళా గ్రౌండ్లో కివ కుంభమేళా నిర్వహించిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం ఎప్పుడూ శాంతి, సామరస్యాన్నే కోరుకుంటుందని, ఎవరిపైనా దాడులు చేయదని అన్నారు. అయితే దురదృష్టవశాత్తూ మన పొరుగుదేశం (పాక్) ఉగ్రవాదాన్ని పెంచిపోస్తూ పెను ఉపద్రవం సృష్టిస్తోందన్నారు. ఐక్యరాజ్యసమితి సైతం ప్రపంచవ్యాప్తంగా ఉగ్రదాడుల నిరోధానికి సమగ్రమైన భద్రత కల్పించడం అనివార్యం అని అన్నారు.
టీడీపీ హయాంలో అమరావతి భజన: మంత్రి కొడాలి నాని