సీఎం జగన్ పేదవాడి ఇంటిముందుకు ప్రభుత్వాన్ని తెచ్చారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కొనియాడారు. అసెంబ్లీలో ఈరోజు ఆయన మాట్లాడుతూ సీఆర్డీఏ రద్దు బిల్లును, అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతిస్తున్నట్టు స్పష్టం చేశారు. ప్రజలకు చంద్రబాబు అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో తన స్వార్థ ప్రయోజనాల కోసమే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారని విమర్శించారు.
నాడు రైతులపై బలవంతంగా భూ సమీకరణ చట్టాన్ని రుద్దారని, శివరామకృష్ణన్ కమిటీని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.రైతులు కోరుకుంటే భూములను తిరిగి ఇవ్వాలని, అమరావతిని అగ్రికల్చర్ జోన్ గా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాలు అన్ని రంగాల్లో ముందున్నాయని, రైలు కూత కూడా వినపడని గ్రామాలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయని చెప్పారు.

