telugu navyamedia
Uncategorized

చంద్రబాబు కుట్రపన్ని అప్పట్లో జగన్ పై కేసులు పెట్టారు: అంబటి

YCP Ambati Slams to JD Laxminaryana

టీడీపీ అధినేత చంద్రబాబు పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిశోర్ సస్పెన్షన్ పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయన్న కారణంగా సస్పెన్షన్ వేటు పడిందన్నారు. తప్పు చేశారని ఆధారాలుంటే ఎవరిపైనైనా.. చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

అప్పట్లో చంద్రబాబు, కాంగ్రెస్ కుట్ర పన్ని వైఎస్ జగన్ పై కేసులు పెట్టారని అంబటి ఆరోపించారు.గతంలో ఆర్థిక అభివృద్ధి మండలి (ఈడీబీ) సీఈవోగా పని చేసిన ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్ ను అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రెండు రోజుల క్రితం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కిశోర్ సస్పెన్షన్ ను చంద్రబాబు తప్పుబట్టారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆయన్ని సస్పెండ్ చేశారని వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు.

Related posts