telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ సుపరిపాలన అందించడం ఖాయం : లక్ష్మీపార్వతి

lakshmi-parvathi

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై వైసీపీ మహిళా నేత నందమూరి లక్ష్మీపార్వతి ప్రశంసల వర్షం కురిపించారు. గుంటూరు జిల్లా కొల్లూరులో వైసీపీ నేత ఘంటా శివరంగారావు నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ దివంగత వైఎస్సార్ ను మరిపించేలా జగన్ సుపరిపాలన అందించడం ఖాయమని అన్నారు.

వైఎస్సార్ వారసుడిగా జగన్ కు ఆ సమర్థత ఉందన్నారు. అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటారని అభిప్రాయపడ్డారు. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు జగన్ పేర్కొన్న నవరత్నాలకు విపరీతంగా ఆకర్షితులై వైసీపీని గెలిపించారన్నారు. ఎవరూ ఊహించని స్థాయిలో రాష్ట్రంలో వైసీపీ అఖండవిజయం సాధించిందని లక్ష్మీపార్వతి కొనియాడారు.

Related posts