telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గోదావరి పుష్కరాలకు ముందే 2027లో పోలవరాన్ని జాతికి అంకితం ఇస్తాము: సీఎం చంద్రబాబు నాయుడు

ఏపీ రాజధాని అమరావతిలో తెలుగు జాతి ఆత్మగౌరవానికి, ప్రాణత్యాగానికి నిలువుటద్దంగా నిలిచిన అమరజీవి పొట్టి శ్రీరాముల 125వ జయంతి సందర్భంగా తుళ్లూరు సమీపంలోని శాఖమూరు పార్కు సమీపంలో 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు.

సుమారు 6.8 ఎకరాల విస్తీర్ణంలో రూ.150 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ ‘స్మృతివనం’లో కేవలం విగ్రహమే కాకుండా, ఒక మ్యూజియం, ఆడిటోరియం, ఫొటో గ్యాలరీని కూడా ఏర్పాటు చేయనున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పొట్టి శ్రీరాముల త్యాగ ఫలమే నేటి ఆంధ్ర రాష్ట్రమని, ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

గోదావరి పుష్కరాలకు ముందే 2027లో పోలవరాన్ని జాతికి అంకితం ఇస్తామని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు.

వైసీపీ పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపే ప్రయత్నం చేసింది. రాజధాని లేని రాష్ట్రంలో మూడుముక్కలాట ఆడింది.

కానీ అమరావతి నిర్మాణానికి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో రైతులు భూములను త్యాగం చేశారు. వారందరూ తల ఎత్తుకునేలా రాజధాని నిర్మిస్తాం’ అని పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ సందర్భంగా స్పష్టం చేశారు.

Related posts