telugu navyamedia
రాజకీయ వార్తలు

జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదంపై ఉక్కుపాదం : కిషన్ రెడ్డి

kishan reddy mp

టెర్రరిజాన్ని అడ్డుకునేందుకు భద్రతా దళాలు కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లోక్ సభలో అన్నారు. జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతున్నామనిఅన్నారు. 2016 నుంచి ఇప్పటి వరకు 733 మంది ఉగ్రవాదులు మృతి చెందారని తెలిపారు.

ఈ ఏడాది జూన్ 16 వరకు అందిన లెక్కల ప్రకారం 113 మంది హతమయ్యారని చెప్పారు. 18 మంది సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఇదే సమయంలో జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలు మూడు రెట్లు పెరిగాయని వెల్లడించారు. ఉగ్రవాదం పట్ల కఠినంగా వ్యవహరించడమే తమ ప్రభుత్వ నిర్ణయమని చెప్పారు. ఉగ్రవాదులకు మద్దతిస్తున్న వారిపై కూడా ప్రత్యేక నిఘా ఉందని చెప్పారు.

Related posts