టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. టెస్టుల్లో ఓ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. అయితే ఈ సారి తన ఆటతో కాకుండా.. కెప్టెన్సీతో సరికొత్త ఫీట్ను అందుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో టీమిండియాకు అత్యధిక మ్యాచ్ల్లో సారథ్యం వహించిన ఆటగాడిగా కోహ్లీ రికార్డుల్లోకెక్కాడు. దీంతో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డు బద్దలయింది. ఇప్పటివరకు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో సమానంగా 60 టెస్ట్ల్లో భారత్కు నాయకత్వం వహించాడు విరాట్ కోహ్లీ. ఇక నిన్న సౌథాంప్టన్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతోన్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్తో కోహ్లీ.. 61వ టెస్ట్లో టీమిండియాకు సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. దీంతో మహీ రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. 2014లో టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. భారత్ తరఫున 60 టెస్టులకి కెప్టెన్సీ వహించాడు. ధోనీ రిటైర్మెంట్ తర్వాత టెస్టు పగ్గాలు అందుకున్న కోహ్లీ.. అతడినే అధిగమించాడు. టీమిండియాకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్గానూ విరాట్ తొలి స్థానంలో ఉన్నాడు. 61 టెస్ట్ల్లో భారత్కు నాయకత్వం వహించి 36 మ్యాచ్లు గెలిపించాడు. మరో 14 మ్యాచ్లు ఓడిపోగా.. 10 మ్యాచ్లను డ్రాగా ముగించాడు.
previous post