telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

Accident

మహారాష్ట్రలోని సోలాపూర్‌ జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వైరాగ్‌ ఏరియాలో మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సు – జీపు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో జీపు నుజ్జునుజ్జు అయింది. నలుగురు దుర్మరణం చెందగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకున్నసహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.

Related posts