టీడీపీపై మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. ఈ సారి చంద్రబాబుతో సహా యనమలను టార్గెట్ చేశారు. “అన్నేళ్లు ఆర్థిక మంత్రిగా పని చేసినా నిబంధనల పట్ల కనీస అవగాహన లేదు యనమలకు. ఎన్టీఆర్ వెన్నుపోటు కుట్రలో బాబుకు కత్తి అందించినందుకు ఇప్పటికీ పదవులు దక్కించుకుంటున్నాడు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ ఎప్పుడు అవసరమో తెలియదు ఈ స్వయం ప్రకటిత మేధావికి.” అంటూ యనమలకు విజయసాయిరెడ్డి చురకలు అంటించారు. ఇక మరో ట్వీట్లో “ప్రత్యేక హోదా వద్దని అప్పటి సీఎం కమిట్ అయినందునే ఇవ్వలేదని కేంద్ర మంత్రి పార్లమెంటులో చెబితే కనీసం నోరు మెదపలేని దరిద్రం ఏమిటి బాబూ? అప్పట్లో కేంద్రానికి నువ్వు చేసిన ఊడిగం వల్ల పారిశ్రామిక ప్రగతి నిల్చిపోయి యువత తీవ్రంగా నష్టపోయింది. రాష్ట్ర పాలనా రాజధాని విశాఖపట్నం అభివృద్ధిపై గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. విశాఖలో రూ. 20 వేల కోట్లతో మెట్రో, ట్రామ్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి భోగాపురం వరకు మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణానికి డీపీఆర్ సిద్ధమైంది.” అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
previous post

