telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్‌ మరో దారుణం.. పదేళ్ల బాలికను నగ్నంగా !

హైదరాబాద్‌ మరో దారుణం జరిగింది.  సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధి కాజా బాగ్ లో నివసిస్తున్న పది సంవత్సరాల గిరిజన బాలిక పై అత్యాచారం చేసి హతమార్చారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ 09 సంవత్సరాల చిన్నారిపై అత్యాచారం చేసి , హత్య కు పాల్పడిన ఘటనలో తమకు న్యాయం చేయాలని పోలీసు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు తల్లిదండ్రులు. అసలు వివరాల్లోకి వెళితే… కాజాభాగ్ లో నివాసముండే సేవ్యా నాయక్ , జ్యోతి దంపతులకు ముగ్గురు సంతానం. ఈ నెల 23వ తేదీ నాడు రోజువారి మాదిరిగానే యధావిధిగా కూలి పనుల కోసం బయటకు వెళ్లి , తిరిగి మధ్యాహ్నం వచ్చే సరికి గుడిసెలో తమ పదేళ్ల కూతురు నగ్నంగా చనిపోయి పడి ఉందని, బాలిక శరీరం పై మెడ, మొహం పై చిన్న చిన్న దెబ్బలు , గాయాలు , గోర్లతో గీరిన ఘాట్లు కనిపించాయని , తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని హుటాహుటిన పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి , పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. మృతురాలి తల్లి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ నా కూతురు ఆత్మహత్య చేసుకునే అవగాహన లేదని , ఎవరో ఉద్దేశ్య పూర్వకంగా హతమార్చారని ఆరోపిస్తోంది. తమ కూతురు మృతి పట్ల తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టు మార్టం నివేదిక కొరకు వేచి చూస్తున్నట్లు , అన్ని రకాల క్లూస్ టీమ్ బృందాలతో దర్యాప్తు కుడా చేపట్టామని , కుటుంబ సభ్యులు , స్థానికులు , వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం అమ్మాయి ప్లాస్టిక్ వైర్ తాడుతో హ్యాంగింగ్ కు పాల్పడినట్లు తెలియజేశారని , తల్లిదండ్రులు కుడా తన కూతురిపై అత్యాచారం చేసి , హత్య కు పాల్పడినారని మాకు ఫిర్యాదు చేశారని , ఆ కోణం లో కుడా దర్యాప్తు చేస్తున్నట్లు వైద్య నివేదికలు రాగానే దర్యాప్తు ముమ్మరం చేసి , నిజానిజాలు తెలియజేస్తామని సైదాబాద్ ఇన్సిపెక్టర్ తెలిపారు.

Related posts