కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పుదుచ్చేరి గవర్నర్ పదవి కిరణ్ బేడిని కేంద్రం తొలగించింది. గవర్నర్ పదవి నుంచి ఆమెను తొలగిస్తున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిలిసైకి అదనపు బాధ్యతలు అప్పగించింది. కొత్తగా లెఫ్టినెంట్ గవర్నర్గా నియామకం అయ్యే వరకు ఆమె ఉంటారని తేల్చి చెప్పింది. నిజానికి గత కొద్ది కాలంగా సీఎం నారాయణస్వామితో కిరణ్బేడికి పొసగడం లేదు. నారాయణస్వామి నిర్ణయాలను బేడి తోసిపుచ్చారు. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. కిరణ్ బేడి తీరును నిరసిస్తూ ఆయన అనేకసార్లు రోడ్డెక్కారు. ఇటీవలే కిరణ్బేడి తొలగించాలంటూ ఆయన ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ నిర్ణయం సంచలనం రేపుతోంది.
next post