దేశ రాజకీయాలలో తెలుగు వారి హుందాతనాన్ని తెలియ చేసిన అగ్రగణ్యుడు పీవీ నరసింహారావు.
ఎవరూ ఊహించని సంస్కరణలు చేపట్టి దారి తప్పిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన అపర చాణక్యుడు.
తెలుగు వాడు అని సగర్వంగా చెప్పుకునే భారతరత్న కిరీటాదారుడు దివంగత పాములపర్తి వెంకట నరసింహారావు.
నరసింహారావు తన కలం ద్వారా సాహితీ వెలుగులు విరజిమ్మిన బహుభాషా కోవిదుడు.
ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు పీవీ ఘాట్ వద్ద పుష్పాల తో నివాళులర్పించారు

