ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితను ఈ ఉదయం మాజీ మంత్రి, ఎమ్మెల్యే టీ హరీష్ రావు కలుసుకున్నారు.
ఆమె యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు.
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్కు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు కవిత.
ఈ ఏడాది మార్చి 15వ తేదీన అయ్యారు. జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు.
తీహార్ జైలులో ఉంటూ ఈడీ విచారణను ఎదుర్కొంటోన్నారు. ఇదే కేసులో సీబీఐ అధికారులు సైతం కవితను అరెస్ట్ చేసింది.
ఈడీ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ జులై 3వ తేదీ వరకు కొనసాగాల్సి ఉంది.
ఆ తరువాత ఆమెను ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం ముందు ప్రవేశపెడతారు .