ఈరోజు నుండి రెండు తెలుగు రాష్ట్రలో ఉప ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. అయితే తెలంగాణలో నాగార్జున సాగర్, ఏపీలో తిరుపతి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ నేడు ప్రారంభం కాబోతున్నది. ఈ నెల 30 వరకు నామినేషన్లు కొనసాగుతుంది. ఈనెల 31 వ తేదీన నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 3 వరకు నామినేషన్ల ఉప సంహరణ ఉంటుంది. ఏప్రిల్ 17 వ తేదీన ఎన్నికలు, మే 2 వ తేదీన ఫలితాలు వెలువడతాయి. ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుండటంతో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను సిద్ధం చేస్తున్నాయి. చూడాలి మరి ఈ ఎన్నికలో ఎవరు విజయం సాధిస్తారు అనేది.
previous post