telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

నేటి నుండే ఉప ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ…

ఈరోజు నుండి రెండు తెలుగు రాష్ట్రలో ఉప ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. అయితే తెలంగాణలో నాగార్జున సాగర్, ఏపీలో తిరుపతి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ నేడు ప్రారంభం కాబోతున్నది. ఈ నెల 30 వరకు నామినేషన్లు కొనసాగుతుంది. ఈనెల 31 వ తేదీన నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 3 వరకు నామినేషన్ల ఉప సంహరణ ఉంటుంది. ఏప్రిల్ 17 వ తేదీన ఎన్నికలు, మే 2 వ తేదీన ఫలితాలు వెలువడతాయి. ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుండటంతో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను సిద్ధం చేస్తున్నాయి. చూడాలి మరి ఈ ఎన్నికలో ఎవరు విజయం సాధిస్తారు అనేది.

Related posts