సీఎం చంద్రబాబు నాయుడు ఆంగ్ల పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూ లో అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తిరుమల లడ్డూ కల్తీ పై మాట్లాడారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారనీ ఇది కేవలం తప్పు కాదు మహా పాపం, గొప్ప పాపం అని చంద్రబాబు అన్నారు.
“ఇది ఒక కుట్ర. అజ్ఞానంలో జరిగిన తప్పు అయితే క్షమించవచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగా చేసిన పనికి వదిలే ప్రసక్తే లేదు.
సాధారణ నెయ్యి హోల్సేల్లో కేజీ రూ.450 ఉంటే, వైసీపీ హయాంలో తిరుమలకు కేజీ రూ.230కే ఎలా ఇచ్చారు? ఇందులో స్పష్టంగా కల్తీ ఉంది” అని చంద్రబాబు అన్నారు.
ఇది దేవుడిపై చేసిన గొప్ప పాపమని, భక్తుల భావాలను దెబ్బతీసే ఉద్దేశపూర్వక చర్య అని ఆయన మండిపడ్డారు.

