టాలీవుడ్ లోని యంగ్ టాలెంటెడ్ యాక్టర్స్ లో ముందుండే పేరు సత్యదేవ్. ప్రతిభ కలిగిన నటుడిగా సత్యదేవ్ కు మంచి పేరుంది. ఇటీవల ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రంతో ఓటిటిలో మంచి హిట్ అందుకున్నాడు. ఇదిలా ఉండగా.. సత్యదేవ్ హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా.. కన్నడంలో విజయం సాధించిన ‘లవ్ మాక్ టైల్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ‘గుర్తుందా శీతాకాలం’అనే టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. నాగ శేఖర్ ఈ సినిమాకు దర్శకుడిగాను నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
అయితే ఈసినిమాలో తమన్నా తో పాటు మరో ఇద్దరు భామలు కూడా నటిస్తున్నారని తెలుస్తుంది. నితిన్ నటించిన ‘లై’ ‘చల్ మోహన్ రంగ’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన మేఘా ఆకాష్ ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా కనిపించనుందట.. ఇక ఈ అమ్మడితో పాటు కన్నడ అందం కావ్య శెట్టిని మరో హీరోయిన్ గా ఎంపిక చేశారని సమాచారం.త్వరలోనే ఈ వార్తలపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా పై ఇప్పటికే చాలా పుకార్లు షికారు చేసాయి. స్టార్ హీరోయిన్ తమన్నా సినిమాకోసం భారీగా డిమాండ్ చేస్తోందని..అలానే సత్య దేవ్ కూడా రెమ్యునరేష్ పెంచేసాడని దాంతో ఈ సినిమా ఆగిపోయిందని కూడా టాక్ వచ్చింది. కానీ ఇవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి.

