telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో 2025 జనవరి 1 నుంచి అమలులోకి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు ప్రభుత్వం నిర్ణయం

పట్టణాలు, గ్రామాల్లో ఒకేసారి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమలులోకి తేవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం.

ఆయా ప్రాంతాల అభివృద్ధి, ఇతర అంశాల ప్రాతిపదికన ప్రస్తుతం ఉన్నదానిపై 10-15 శాతానికి పెరగనున్న రిజిస్ట్రేషన్ విలువలు.

గత ప్రభుత్వ పాలనలో మాదిరిగా అసమానతలు లేకుండా శాస్త్రీయ విధానంలో విలువల పెంపు జరిగేలా ప్రభుత్వం కసరత్తు.

రిజిస్ట్రేషన్ విలువలతో పాటు నిర్మాణ విలువలు కూడా సవరింపు. కొత్త రిజిస్ట్రేషన్ విలువలపై ఈ నెల 24 వరకు అభ్యంతరాలు, సలహాలు, సూచనల స్వీకరణ.

ఈ నెల 27 వరకు అభ్యంతరాలు, సలహాలు, సూచనల పరిశీలన. 2025 జనవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రార్లకు ఆదేశాలు.

Related posts