telugu navyamedia
క్రీడలు వార్తలు

మేజర్ హీరోయిన్ ఫస్ట్ లుక్ విడుదల…

ఎప్పటికప్పుడు కొత్త కథలతో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని అలరిస్తుంటాడు అడవి శేష్. అలాంటి అడవి శేష్ ప్రస్తుతం మేజర్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో 26/11 ముంబై టెర్రర్ అటాక్స్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో శేష్ కనిపించనున్నాడు. ఈ సినిమా నిజ జీవితం ఆధారంగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం కొన్ని సంవత్సారల పాటు శేష్ శ్రమించాడు. అయితే మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జయంతి సందర్భంగా మార్చి 28న ‘మేజర్’ మూవీ టీజర్ విడుదల చేసారు. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ప్రమోద అనే పాత్రలో శోభిత నటిస్తున్నట్టు పోస్టర్ ద్వారా తెలియజేశారు అయితే ఈ సినిమా కోసం శేష్ ఎంతగానో కష్టపడుతున్నాడు. ఈ సినిమాలో ఉన్ని కృష్ణన్‌లా ఉండాలని అతడిని అర్థం చేసుకుంటూ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా మహేష బాబు బ్యానర్‌లో నిర్మితమవుతోంది. ఈ సినిమాను సోనీ పిక్చర్స్‌ వారు అంతర్జాతీయంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా శశి కిరన్ దర్శకత్వంలో తెరకెక్కతోంది.

Related posts