తమ ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామానికి చెందిన ఎండీ పర్వీనా కుట్టు మిషన్ శిక్షణ పొందుతోంది. ఈ క్రమంలో ఆమెకు అక్కడి కిరాణా షాప్ లో పనిచేసే బాలేశ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. కొద్దికాలంలోనే వీరి పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ప్రేమ విషయం
బాలేశ్ కుటుంబసభ్యులకు తెలియడం, వేర్వేరు మతాలు కావడంతో వారు మందలించారు.
దీంతో మనస్తాపానికి గురైన బాలేశ్, పర్వీనాలు కలిసే చావాలనుకున్నారు. ఒక రోజు ముందే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన వీరు ఝాన్సీలింగాపూర్ గ్రామంలోని అటవీ ప్రాంతానికి చేరుకున్నారు.రాత్రంతా అటవీ ప్రాంతంలోనే గడిపిన వీరు శనివారం రాత్రి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.