telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు ఉద్యోగాలు రాజకీయ వార్తలు

ఒప్పందం చేసుకున్న ప్రతీ ప్రాజెక్టుపైనా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు

ఒప్పందం చేసుకున్న ప్రతీ ప్రాజెక్టుపైనా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని గౌరవ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

ఎంఓయూ చేసుకుంటే అది ప్రభుత్వ ప్రాజెక్టుగా భావించి వేగంగా పూర్తి అయ్యేందుకు పూర్తిగా సహకరిస్తామని వెల్లడించారు.

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలోనే అనుమతులు మంజూరు చేసి ప్రాజెక్టు సాకారమయ్యేలా చూస్తామని పారిశ్రామిక వేత్తలకు భరోసా ఇచ్చారు.

కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని పరిశ్రమల పురోగతిపై సీఎం నేడు సమీక్షించారు. కుప్పంలో రూ. 7684 కోట్ల విలువైన పెట్టుబడులతో 21 పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయని తెలిపారు.

వీటి ద్వారా 35,545 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా మరో 44,584 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు.

కుప్పంలో పరిశ్రమల ఏర్పాటుకు ఎంఓయూలు చేసుకున్న కంపెనీలు

1.ఇండెక్స్ ఇండస్ట్రీస్, రూ.33 కోట్ల పెట్టుబడి, 996 మందికి ఉద్యోగాలు.

2.ఎంఏఎఫ్ క్లాతింగ్ ప్రైవేట్ లిమిటెడ్, రూ.200 కోట్ల పెట్టుబడి,4000 మందికి ఉద్యోగాలు.

3.ఇన్ ఫ్రా క్రాఫ్ట్ సంస్థ, రూ.50 కోట్ల పెట్టుబడి, 1400 మందికి ఉద్యోగాలు.

4.న్యూట్రీ ఫీడ్స్, రూ.180 కోట్ల పెట్టుబడి, 2210 మందికి ఉద్యోగాలు.

5.ఫార్మ్ అమ్మినో అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్, రూ.35 కోట్ల పెట్టుబడి, 250 మందికి ఉద్యోగాలు.

6.ఇన్ ఫేస్ పవర్ టెక్నాలజీస్, రూ.137కోట్ల పెట్టుబడి, 650 మందికి ఉద్యోగాలు.

Related posts