telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

ఈసీ ఆదేశాలతో.. గౌతమ్ గంభీర్ పై ఎఫ్ఐఆర్!

cricketer goutam gambhir on his retirement

మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ బీజేపీ తరపున ఈ ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. తూర్పు ఢిల్లీ బీజేపీ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి గౌతమ్‌ గంభీర్‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని న్నికల కమీషన్ పోలీసులను ఆదేశించింది.ఈస్ట్ ఢిల్లీలో అనుమ‌తి లేకుండానే.. గంభీర్ ర్యాలీ నిర్వ‌హించ‌డాన్ని ఈసీ త‌ప్పుప‌ట్టింది. ఈ ఎన్నికల బరి నుంచి గౌతమ్ తప్పించేందుకు కాంగ్రెస్, ఆప్ పార్టీలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

గౌతమ్ గంభీర్ కు రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నారంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ఢిల్లీలో తిస్‌హజారీ కోర్టులో ఫిర్యాదు చేసింది. రెండు చోట్ల ఓటు హక్కు, రెండు ఓటరు కార్డులు కలిగి ఉండటం నేరమని, ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీకి గంభీర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని ఆప్‌ తూర్పు ఢిల్లీ అభ్యర్థి అతిషి డిమాండ్‌ చేశారు.

Related posts