ఇటీవల కాలంలో బాలీవుడ్ భామలు తెలుగు సినిమాల్లో నటించడానికి కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే యస్ యస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న “ఆర్ఆర్ఆర్” చిత్రంలో రామ్చరణ్ సరసన అలియా భట్ నటిస్తున్నసంగతి అందరికీ తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ భారీ చిత్రాన్ని తెరకెక్కించనున్నది. అందులో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన వార్త ఏమిటంటే… ఫైనల్గా బాలీవుడ్ భామ అలియాను ఎంపిక చేశాడు నాగ్. ఈ సినిమాలో నటించేందు ఈ అమ్మడు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. లాక్డౌన్ ముగిసిన తర్వాత నాగ్ ముంబై వెళ్లి అలియాకు కథ చెప్పనున్నట్లు తెలుస్తోంది. అయితే అంతకుముందే నాగ్ పలువురు హీరోయిన్లను ఎంపిక చేయగా వారికి డేట్స్ కుదరకపోవడంతో అలియా భట్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
previous post
next post