telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు తొలిగిపోయి శాంతి నెలకొనాలి – నటుడు నరేశ్ ట్వీట్!

ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

ఇదే విషయమై నటుడు నరేశ్ తాజాగా ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా స్పందించారు.

తాను ఊహించినట్లుగానే ఏపీలో అధికార మార్పిడికి ముందు రక్తపాతం జరిగిందని ఆయన ట్వీట్ చేశారు. “ఏపీలో ఎన్నికల పోరు ముగిసింది. ఓటర్లు తీర్పు ఇచ్చారు.

అలాగే ప్ర‌స్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితులు తొలిగిపోయి శాంతి నెల‌కొనాల‌ని, ప్రజలకు అత్యంత ఇష్టమైన నాయకులు గెలవాలని కోరుకుంటున్నా” అని న‌రేశ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

Related posts