రేపు జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. శనివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు.
చాలా చోట్ల చెక్పోస్టులు పెట్టి వాహనాలను తనిఖీలు చేస్తున్నారని. నేతల వాహనాలను సైతం చెక్ చేశారు. 20 కంపెనీల కేంద్ర బలగాలు, 4 వేల మంది రాష్ట్ర పోలీసులు బందోబస్తులో ఉన్నారు.306 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 127 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అక్కడ కేంద్ర బలగాలతోపాటు లోకల్ పోలీస్ లతో భద్రత ఏర్పాటు చేశామని అన్నారు. పోలింగ్ సిబ్బంది సామగ్రితో కేంద్రాలకు చేరుకున్నారు.
2018 ఎన్నికల్లో 84.5 శాతం ఓటింగ్ నమోదు అయింది. ఈసారి ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని శశాంక్ గోయల్ స్పష్టం చేశారు. అలాగే.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ఓటర్లు తప్పకుండా మాస్క్ పెట్టుకోవాలని, ఫిజికల్ డిస్టన్స్ పాటించాలని పోలింగ్ సూచించారు.
కాగా..హుజురాబాద్ నియోజకవర్గంలో 5 మండలాలు 106 గ్రామాలు ఉన్నాయి. 30 మంది పోటీలో ఉన్నారు. 2 లక్షల 37 వేల 36 మంది ఓటర్లు ఉన్నారు. మహిళలు లక్షా 19వేల 102మంది, పురుషులు ఒకలక్షా 17వేల 993మంది, ఇతర కేటగిరీ లో ట్రాన్స్ జెండర్ ఒకరు ఉండగా ,సర్వీస్ ఓటర్ లు 149 మంది ఎన్నారై లు 14 మంది ఉన్నారు.
పోలింగ్ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది 1715 మంది అధికారులు ఇప్పటికే రెండు డోస్ ల కోవిడ్ టీకా తీసుకోవడం తో పాటు ఆర్టీపిసిఅర్ కోవిడ్ టెస్ట్ చేయించుకొని దృవపత్రం సమర్పించాలని ఎన్ నికల అధికారులు ఆదేశించారు.