telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

దేవుడు బీజేపీ సొత్తే.. బండి సంజయ్‌ సంచలనం

దేవుడు బీజేపీ సొత్తు కాదు కేటీఆర్‌ అంటున్నారని…దేవుడు బీజేపీ సొంతమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాముడి పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడింది ఎవరు…రాముడిని యూపీ రాముడు అని అన్నది ఎవరని ప్రశ్నించారు. 2023 లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. కేసీఆర్ జైలు నుండి చూడాల్సిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్‌. రెండు ఎమ్మెల్సీ రెండు స్థానాల్లో భారీ మెజారిటీతో గెలవబోతున్నామని పేర్కొన్నారు. ఓడి పోతున్నామని తెలిసే ఓటర్ ని సీఎం కేసీఆర్‌ రిక్వెస్ట్ చేయలేదని.. అహంకారంతో వ్యవహరించే సీఎంకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. ఓడి పోతున్నామని తెలిసి ఉద్యోగ సంఘాలతో మాట్లాడారని.. చిత్తశుద్ధి ఉంటే పీఆర్సీ పై ఎన్నికల కమిషన్ అనుమతి ఎందుకు తీసుకోలేదు…పీఆర్సీ ఇస్తామంటే మేము వ్యతిరేకించం… అనుమతి ఇవ్వాలని ఈసీ కి విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. తాను ఆస్తులు సంపాదించారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని…అది నిరూపిస్తే నిరుద్యోగ భృతి, ప్రైవేట్ లెక్చరర్ లకు జీతాలు ఇస్తానని సవాల్‌ విసిరారు. ఒక రాజకీయ పార్టీకి ఉద్యోగ సంఘాల మద్దతు ఇవ్వడంపై ఫిర్యాదు చేస్తామన్నారు. 45 శాతం ఫిట్ మెంట్ కి తక్కువ తీసుకోమని చెప్పి 29కి ఎలా అంగీకరించారని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ విషయంలో మాట్లాడేందుకు అక్కడ ఉదండులు ఉన్నారని…నీ ఏడుపు నీవు ఏడువు అని కేటీఆర్‌కి చురకలు అంటించారు. అజంజాహి మిల్స్, నిజాం షుగర్ పై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Related posts